బిగ్ బాస్ షో సీజన్ 4 లో 14వ వారం ఎలిమినేట్ అయిన మోనాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.అఖిల్, అభిజిత్ లతో లవ్ ట్రాకుల ద్వారా పాపులర్ అయిన మోనాల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా తన అక్కకు పెళ్లైందని, అంకుల్ చనిపోయారని తాను హౌస్ లో ఉండటం వల్ల బయటకు వచ్చే వరకు ఆ విషయాలు తనకు తెలియలేదని తెలిపారు.
బిగ్ బాస్ ఫినాలే కు మరో ఆరు రోజులు మాత్రమే ఉండటంతో ఆమె గుజరాత్ కు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉన్నారు.
బిగ్ బాస్ షో ఆఫర్ గురించి మోనాల్ కు ప్రశ్నలు ఎదురు కాగా తనకు బిగ్ బాస్ సీజన్ 2, సీజన్ 3లో కూడా ఆఫర్ వచ్చిందని.
మూడవ సీజన్ సమయంలో అమెరికాలో ఉండటం వల్ల కుదరలేదని తెలిపారు.బిగ్ బాస్ సీజన్ 4కు తనకు ఏప్రిల్ లో ఆఫర్ వచ్చిందని విజిబులిటీ ఉండాలని భావించి బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు.
తనకు తెలుగు రాకపోయినా నమ్మకం కలిగించడంతో షోకు సెలెక్ట్ చేశారని అన్నారు.
బిగ్ బాస్ షోలో పాల్గొనడం కోసం జులైలో ఒక సినిమా ఆఫర్ ను కూడా వదులుకున్నానని ఆమె అన్నారు.చాలామంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో జై శ్రీకృష్ణ గోవిందాగోవింద అని ఎందుకన్నావని అడుగుతున్నారని.ఇంట్లో అలానే పిలుచుకుంటాం కాబట్టి హౌస్ లో అలా అన్నానని తెలిపారు.
ఆర్టిస్ట్ గా స్కోప్ కోసమే షోలో పాల్గొన్నానని బిగ్ బాస్ షోలో 14 వారాలు ఉండటం వల్ల గుర్తింపు వచ్చిందని తెలిపారు.
బిగ్ బాస్ షోలో ఆఫర్ రాగానే చాలా ప్రిపేర్ అయ్యానని మోనాల్ తెలిపారు.
మరోవైపు బిగ్ బాస్ షో విన్నర్ ఎవరవుతారని ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.అభిజిత్ విన్నర్ అవుతారని ప్రచారం జరుగుతున్నా సోహైల్, అరియానాలు కూడా విన్నర్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.