బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొని ఏకంగా 14 వారాలు బిగ్ బాస్ హౌస్ ఉండి ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్సీ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరించడంతో పాటు సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.
సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్ ప్రత్యేక గీతంలో నటించి మెప్పించారు.
మరోవైపు మోనాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ షో గురించి, ఇతర విషయాల గురించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో మొదట అభిజిత్ తో సన్నిహితంగా మెలిగిన మోనాల్ ఆ తరువాత అఖిల్ తో సన్నిహితంగా మెలిగారు.అఖిల్ మోనాల్ మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఒక ప్రముఖ ఛానల్ కు మోనాల్ ఇంటర్వ్యూ ఇవ్వగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటన గురించి మోనాల్ చెప్పుకొచ్చారు.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనను చూసిన కొందరు అభిమానులు అఖిల్ ఎలా ఉన్నాడని గట్టిగా అరిచారని అలా అరవడం తనకు ఇబ్బందిగా అనిపించిందని మోనాల్ తెలిపారు.టాలీవుడ్ సినిమాల్లో నటించిన తరువాత చాలా గ్యాప్ వచ్చిందని.బిగ్ బాస్ షో వల్లే మోనల్ అంటే అందరికీ తెలిసిందని మోనాల్ తెలిపారు.
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో ఎయిర్ పోర్ట్ లో అందరూ మోనాల్ అని గుర్తించారని ఆమె తెలిపారు.
సొంత సిటీలో గుర్తుపట్టడం సంతోషాన్ని కలిగిస్తున్నా అఖిల్ గురించి అడగడంతో ఇలా అడుగుతాన్నారేంటని అనిపిస్తోందని పరోక్షంగా అలా అడగడం బాధిస్తోందని మోనాల్ చెప్పారు.
ఇకపై అఖిల్ గురించి అడగవద్దని తాను కోరుకుంటున్నానని మోనాల్ చెప్పుకొచ్చారు.