బిగ్ బాస్ బ్యూటీ, నటి మోనాల్ గజ్జర్.హౌస్ లో ఉన్నంత కాలం ట్రయాంగిల్ లవ్ తో ఎంత రచ్చ చేసిందో చూశాం.
అంతేకాకుండా మరో కంటెస్టెంట్ అఖిల్ తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.హాగ్, కిస్ లతో తెగ రెచ్చిపోయింది.
పైగా వీరిద్దరి మధ్య లవ్ జర్నీ నడుస్తున్నట్లు కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ జంట బయటకు వచ్చాక కూడా మరింత దగ్గరయ్యారు.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అఖిల్ తో దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక బిగ్ బాస్ ముందు పలు సినిమాలో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేని ఈ బ్యూటీ బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోయింది.
ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.బుల్లితెర షో లో జడ్జిగా చేసింది.అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ అఖిల్ తో కలసి ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇటీవలే అఖిల్ కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండగా దానికి కారణం మోనాల్ అని తెగ కామెంట్స్ చేశారు.నిజానికి వీరిద్దరూ వీడియో కాల్స్ చేసుకోవడం, కలిసి బయటకు తిరగడం వంటివి చేయడంతో అఖిల్ అలా చేశాడని అనగా ఇటీవలే వీరిద్దరూ మళ్లీ వీడియో కాల్ లో మాట్లాడారని తెలియగా అఖిల్ వేరే కారణంతో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడని అర్థమైంది.
ఇక మోనాల్ ఇటీవలే హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది.తాజాగా తన ఫాలోవర్స్ తో ముచ్చటించిన మోనాల్ తన కొత్త ఇంటికి సంబంధించిన విషయాలు పంచుకుంది. లైవ్ లోకి వచ్చిన కొద్దిసేపటికి వెళ్లిపోతానని తెలిపింది.
తన బ్యాటరీ 10శాతానికి వచ్చిందని అది చచ్చిపోయేలా ఉందని తాను ప్రతిసారి లైవ్ లోకి వచ్చినప్పుడు ఇదే జరుగుతుందని తెలిపింది.
దాంతో ఓ నెటిజన్ బ్యాటరీ అయిపోయే ముందు ఎందుకు లైవ్ లోకి వస్తావని ప్రశ్నించగా ఇలా ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడే ఆ కారణం చెప్పి త్వరగా లైవ్ లో నుంచి వెళ్ళిపోవచ్చని అందుకే ఆ సమయంలో లైవ్ లోకి వస్తానని తెలిపింది ఈ బ్యూటీ.
దీంతో ఈమె తెలివికి అందరూ ఫిదా అయ్యారు.