ఎక్కడైనా పిల్లలు సరిగా చదవకపోతే మందలించే పేరెంట్స్.ఉన్నారు.
మరీ ఎక్కువైతే.తిట్టి.
కొట్టే వారు ఉన్నారు.అయితే న్యూ యార్క్ నగరంలో జరిగిన ఒక సంఘటన చూస్తే మాత్రం అందరూ అవాక్కు అవ్వక తప్పదు….
తన కూతురిపై తల్లి తీరు చూస్తే.మానవ సంబందాలు ఎలా తయారయ్యాయో అర్ధం అవుతుంది….
అసలేం జరిగింది అని అంటే…న్యూయార్క్లో గ్రాడ్యుయేట్ కావాలంటే విద్యార్థులు తప్పనిసరిగా ఐదు పరీక్షల్లో పాస్ కావాల్సిందే.ఈ నేపథ్యంలో కరెన్ షీరోన్ అనే 48ఏళ్ల మహిళ కూతురు న్యూయార్క్ స్టేట్ ఎగ్జాంలో ఉత్తీర్ణురాలు కాలేకపోయింది.
దీంతో కోపంతో ఊగిపోయిన తల్లి.బెదిరింపులకు దిగింది…బాంబు పెడతానని బెదిరించిందని పోలీసులు చెప్పారు.
తన బెదిరింపుల పైన ఆ మహిళ ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదు అని కూడా తెలిపారు.కూతురు పైనే కాకుండా స్కూల్ పైన కూడా ఆమె బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది.కాగా…ఆమె బెదిరించిన స్కూల్ పేరు సుసాన్ వాంగర్ హైస్కూల్ అని సమాచారం.