సాధారణంగా మనం ఆటో, బస్సు, రైలు, ఇతర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణించిన సమయంలో పలు సందర్భాల్లో ఏదో ఒక వస్తువును కంగారులో మరిచిపోయిన ఘటనలను అనుభవించే ఉంటాం.ఆ తరువాత ఆ వస్తువుల కోసం ఇబ్బందులు పడే ఉంటాం.
మనకో, మనకు తెలిసిన వాళ్లకే తప్పకుండా ఇలాంటి ఘటన జరిగే ఉంటుంది.అయితే కంగారులో కనబిడ్డను మరిచిపోవటం గురించి మాత్రం ఎప్పుడూ వినలేదు.
అయితే లండన్ లో మాత్రం ఒక మహిళ కంగారులో వేగంగా రైలు దిగే సమయంలో ఏకంగా కన్నబిడ్డనే మరిచిపోయింది.హడావిడిగా రైలు దిగిన మహిళ దిగిన వెంటనే చంటి బిడ్డను మరిచిపోయినట్లు గుర్తించింది.
దక్షిణ లండన్ లోని హెక్కాహెమ్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.రైలు దిగి కొంతదూరం వెళ్లిన తరువాత చేతిలో చంటి బిడ్డ లేదనే విషయాన్ని తల్లి గుర్తించింది.
దీంతో కంగారు పడిన మహిళ వెంటనే స్టేషన్ అధికారులను సంప్రదించి అసలు విషయం చెప్పింది .తన బిడ్డ రైల్లోనే ఉందని… తాను కంగారులో రైలు దిగేశానని… గుండెలు బాదుకుంటూ కన్నీళ్లతో అధికారులను వేడుకుంది.రైల్వే సిబ్బంది వెంటనే మరో రైల్వే స్టేషన్ సిబ్బందికి విషయం తెలియజేసి కొంత సమయం రైలును ఆపేలా చేశారు.దూరమైన బిడ్డ చెంతకు చేరడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రస్తుతం ఈ ఘటన సొషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తల్లి బిడ్డను మరిచిపోవడంపై కొందరు నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.అయితే సదరు మహిళకు మతిమరపు ఉందని అందువల్లే సొంత బిడ్డను మరిచిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు.
బిడ్డ కోసం రైలును ఆపడంతో ఆ ప్రభావం మిగతా రైళ్లపై పడింది.రైలు ఆగడం వల్ల ఆ మార్గంలో వెళ్లే మిగతా రైళ్లు ఆలస్యమయ్యాయని తెలుస్తోంది.