కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కెరీర్ పరంగా అనేక పాత్రలు చేసిన మోహన్ బాబు హీరోగా అదే రీతిలో విలన్ పాత్రలో సినిమా ప్రేక్షకులను అలరించడం జరిగింది.నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించారు.
ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చిన ప్రారంభంలో ఒక ప్రముఖ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
దాదాపు ఆరు నెలలు పని చేయించుకుని కేవలం 50 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
అదేమిటని ప్రశ్నిస్తే.టిఫిన్, భోజనాలు.
టీ అనీ ఇక్కడే లాగిస్తున్నారు కదా అందుకే అని అన్నారు.చాలా బాధేసింది అని మోహన్ బాబు ఇంటర్వ్యూలో తెలిపారు.
రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడివి, నీకు భాష రాదు సినిమా ఇండస్ట్రీలో నీకు అవకాశాలు రావు అని ప్రారంభంలో చాలామంది నిరుత్సాహ పరిచారు.కానీ భాషపై ఎంతో సాధన చేశాను… చివరాకరికి సక్సెస్ అయ్యాను.
అని మోహన్ బాబు తన కెరియర్ కి సంబంధించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 11 మా ఎన్నికలు జరిగిన తర్వాత.
పవన్ తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో.మోహన్ బాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది దాని గురించి సినిమా ఇండస్ట్రీ అదే రీతిలో రాజకీయ నేతలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.