రీమేక్ స్పెషలిస్ట్ గా కోలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మోహన్ రాజా పరుత్తివీరన్ సినిమాతో తన ఓన్ మార్క్ చూపించి సూపర్ హిట్ కొట్టాడు.ఈ సినిమాని తెలుగులో ధ్రువగా రామ్ చరణ్ రీమేక్ చేసి హిట్ కొట్టాడు.
ఇప్పుడు ఈ టాలెంటెడ్ దర్శకుడు ఫస్ట్ టైం తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవితో సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ని రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమా రీమేక్ బాధ్యతలు ముందుగా యంగ్ టాలెంట్ సుజిత్ కి అప్పగిస్తే అతను చేతులెత్తేశాడు.తరువాత వివి వినాయక్ ఫ్రేమ్ లోకి వచ్చిన ఎందుకనో అతను కూడా తరువాత తప్పుకున్నాడు.
హిందీలో బెల్లంకొండ బాబుతో ఛత్రపతి రీమేక్ మీద పడ్డాడు.దీంతో ఈ రీమేక్ బాధ్యతలని చిరంజీవి సన్నిహితుడు ఎడిటర్ మోహన్ తనయుడు, రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా చేతికి అప్పగించాడు.
ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేశాడు.ఈ నెల నుంచి షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే మోహన్ రాజా తాజాగా చిరంజీవితో తనకి గతంలో ఉన్న అనుభవం గురించి మీడియాతో పంచుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఎడిటర్ మోహన్ నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 25 ఏళ్ల క్రితం హిట్లర్ సినిమా చేశారు.ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది.ఆ సినిమాకి తాను కోప్రొడ్యూసర్ గా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు.తన తండ్రి నిర్మాత కావడంతో తన పేరు కోప్రొడ్యూసర్ గా వేశారని, మరల ఇన్నేళ్ల తర్వాత లూసీఫర్ తో అతన్ని దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా మోహన్ రాజాకి ఈ సినిమా బాధ్యతలు అప్పగించడం వెనుక ఫ్యామిలీ ఫ్రెండ్ షిప్ ఉందనే విషయం దీంతో క్లారిటీ వచ్చింది.
.