ఏడేళ్ల క్రితం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.మలయాళీలో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించిన దృశ్యం సుమారు అన్ని భాషలలో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
తెలుగులో వెంకటేష్ ఈ సినిమాని రీమేక్ చేసి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అలాగే భారతీయ భాషలలోనే కాకుండా చైనాలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.ఈ రేంజ్ లో అన్ని భాషల ప్రజలకి నచ్చిందంటే సినిమాలలో కంటెంట్ ఎంత పవర్ ఎంత అద్భుతమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దృశ్యం సినిమాకి సీక్వెల్ ని దర్శకుడు జీతూ జోసెఫ్ సిద్ధం చేశాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.
ఇటీవల మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ను ప్రకటించారు.కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేశారు.
మరల షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వడంతో తాజాగా ప్రారంభించారు.ఈనెల 26వ తేదీ నుంచి సెట్స్లోకి మోహన్ లాల్ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.
ఇందులో నటించే వారు, తమ పాత్రల షూటింగ్ పూర్తయ్యే వరకు ఎటువంటి ప్రయాణాలు చేయడానికి వీలు లేదని షరతు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో లేదంటే సౌత్ నాలుగు భాషలలో రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండటంతో కొద్ది రోజుల తర్వాత సినిమా గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తుంది.