మలయాళ సూపర్ స్టార్ నటించిన మరక్కార్ సినిమా నేడు విడుదల అయ్యింది. కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కేవలం మలయాళంలో మాత్రమే ఇతర భాషల్లో కూడా విడుదల అయిన విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను మొదట ఓటీటీ లో విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు.కాని మోహన్ లాల్ అభిమానులు సినిమా ను ఓటీటీ లో విడుదల చేస్తే థియేటర్ ఫీల్ మేము కోల్పోతాం అంటూ ఆందోళన చేయడం జరిగింది.
దాంతో కేరళ రాష్ట్ర మంత్రి స్వయంగా రంగంలోకి దిగి థియేటర్లకు పూర్తి అనుమతులు ఇస్తాం.ఓటీటీ లో రిలీజ్ చేయకుండా థియేటర్ రిలీజ్ కు సిద్ధం చేయండి అంటూ సూచించడం జరిగిందట.
దాంతో మేకర్స్ నేడు థియేటర్ల ద్వారా విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయంటూ మోహన్ లాల్ అభిమానులు చెబుతున్నారు.
అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని భారీ వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయంటూ వారు చెబుతున్నారు.ఈ విషయంలో మోహన్ లాల్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వంద కోట్లు సాధించిన మాట నిజం కాదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.తెలుగు నిర్మాతలు కనుక ఫేక్ కలెక్షన్స్ ను ప్రచారం చేసినట్లుగా మలయాళం నిర్మాతలు కూడా ఈ ఫేక్ కలెక్షన్స్ ను ప్రచారం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
మోహన్ లాల్ అభిమానులు ప్రచారం చేస్తున్న ఈ సినిమా వసూళ్ల విషయంలో మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.