టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం మహేష్ అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.
అలాగే ఈ సినిమా తర్వాత వచ్చిన ఖలేజా సినిమా కూడా విజయం సాధించింది.వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుండటంతో ప్రేక్షకులు ఆ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అయినా మోహన్ బాబు నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబు కు మామయ్య గా మోహన్ బాబు నటించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
మోహన్ బాబు నటించిన ఆ పాత్రను త్రివిక్రమ్ వైవిధ్యంగా రూపొందించారు అని సమాచారం.ఇది ఇలా ఉంటే 1989లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం సినిమా లో మహేష్ బాబు, మోహన్ బాబు ఇద్దరూ కలిసి నటించారు.ఇక దాదాపుగా 33 సంవత్సరాల తర్వాత మళ్లీ మహేష్ బాబు, మోహన్ బాబు కలిసి నటించబోతున్నారు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మరీ ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.