కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన బిగ్గెస్ట్ మూవీ ‘పెదరాయుడు’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో అప్పట్లో జనాలు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.
బాక్సాఫీస్ కలెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లోనే ఈ సినిమా కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది.రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పెదరాయుడు పాత్రలో మోహన్ బాబు జీవించేశాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మోహన్ బాబు ఈ సినిమా ప్రారంభానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో టాలీవుడ్కు చెందిన అతిరథ మహానుభావులు అందరూ హాజరయ్యారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, రజినీకాంత్, దాసరి నారాయణరావు లాంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.ఇక ఈ సినిమాలో మోహన్ బాబు డ్యుయెల్ రోల్ చేయగా, ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కేమియో పాత్రలో నటించాడు.
భానుప్రియ, సౌందర్యలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించగా, మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.ఇక ఈ సినిమాతో మోహన్ బాబు తన కెరీర్లోనే బిగ్గె్స్ట్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా కలెక్షన్ల పరంగా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమా ప్రారంభోత్సవ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.