ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీద సినీ నటుడు మోహన్ బాబు ఘాటు విమర్శలు చేసారు.తిరుపతిలో తాను నడుపుతున్న విద్యానికేతన్ లో విద్యార్ధులకి గత మూడు సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వం ఫీజ్ రియాంబర్స్మెంట్ చెల్లించలేదని, దీని వలన విద్యార్ధులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మోహన్ బాబు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
అయితే ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ కి ఇప్పటికే తాను చాలా సార్లు లేఖలు రాసానని, వాటిలో ఒక్క దానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని మోహన్ బాబు విమర్శలు చేసారు.
విద్యార్ధుల విషయంలో చిత్తశుద్ది లేకుండా చంద్రబాబు పరిపాలన వుందని వాఖ్యలు చేసిన మోహన్ బాబు, సాధ్యం కాకపోతే హామీలు ఎందుకు ఇవ్వాలని విమర్శలు చేసారు.
అయితే చంద్రబాబుపై తాను చేస్తున్న విమర్శలకి తాను మాత్రమే బాద్యత వహిస్తా అని, నేను ఎ పార్టీలో క్రియాశీలకంగా లేనని, నా వెనుక ఎ పార్టీ వుండి ఈ విమర్శలు చేయించలేదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.కేవలం తన విద్యాసంస్థలో విద్యార్ధుల సమస్యలు చూసినవాడిగా ఈ విమర్శలు చేస్తున్నా అని మోహన్ బాబు వాఖ్యానించారు.
మరి దీనికి ఏపీ సర్కార్ ఎం సమాధానం చెబుతారో అనేది వేచి చూడాలి.
.