కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు, ప్రముఖ నటుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం గురించి మాట్లాడుతూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొరకు గతంలో ఒక భవనాన్ని కొనుగోలు చేసి అమ్మేశారని మోహన్ బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎక్కువ మొత్తం ఖర్చు చేసి భవనాన్ని కొనుగోలు చేసి అమ్మే సమయంలో మాత్రం ఎందుకు తక్కువ ధరకు అమ్మేశారని మోహన్ బాబు ప్రశ్నించారు.
ఎవరైనా ఈ భవనం గురించి మాట్లాడారా అని మోహన్ బాబు సంచనల వ్యాఖ్యలు చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనంకు సంబంధించిన విషయం తనను కలచివేస్తుందని మోహన్ బాబు కామెంట్లు చేశారు.
వర్చువల్ పద్ధతిలో మూవీ ఆర్టిస్ట్ కార్యవర్గ సమావేశం జరగగా మోహన్ బాబు ఈ కామెంట్లు చేశారు.
సమావేశంలో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని మోహన్ బాబు అన్నారు.ప్రస్తుతం ‘మా’లో పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఉందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు మాట్లాడుతున్నారని ఎన్నెన్నో జరుగుతుంటే వాటిని చూస్తున్నామని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.‘మా’ పరిస్థితులపై మోహన్ బాబు ఆవేదన చెందుతున్నారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది.
ఎస్వీ రంగారావు దగ్గరి నుంచి తాను అందరినీ చూశానని మోహన్ బాబు కామెంట్లు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఎంతమంది అని మనకెందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదని మోహన్ బాబు అన్నారు.మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు