టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలను పోషించిన అతికొద్ది మంది నటులలో మోహన్ బాబు ఒకరనే తెలిసిందే.గతంతో పోలిస్తే సినిమాల సంఖ్యను తగ్గించినా మంచి పాత్రలకు ఓకే చెబుతూ మోహన్ బాబు సత్తా చాటుతున్నారు.
తాజాగా అలీతో సరదాగా పార్ట్2 ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో మోహన్ బాబు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తాను నిర్మాతగా తెరకెక్కిన సినిమాలో కొంతమంది నటులు కార్డ్స్ ఆడుతుంటే తాను తన్నానని మోహన్ బాబు తెలిపారు.
ఫసక్ అనే డైలాగ్ గురించి స్పందిస్తూ మోహన్ బాబు యమధర్మరాజు ఎం.ఏ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, రజినీకాంత్, తాను ఒకే స్టేజ్ పై ఉన్న సమయంలో మాట్లాడుతూ తనను దొంగ నా కొడుకు అని అన్నారని మోహన్ బాబు నవ్వుతూ చెప్పుకొచ్చారు.పెదరాయుడు సినిమాలో తండ్రి పాత్రను రజినీకాంత్ వేస్తానని ఆయనే చెప్పారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
తనకు తండ్రి పాత్ర అని చెప్పినా రజినీకాంత్ వినలేదని మోహన్ బాబు పేర్కొన్నారు.రజినీకాంత్ కు హ్యాట్సాఫ్ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
అలీ పరిటాల రవి పేరు చెప్పగానే మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.నా జీవిత చరిత్ర రాస్తున్నానని అయితే అలీ తన జీవితాన్ని అడిగేస్తున్నారని మోహన్ బాబు కామెంట్లు చేశారు.
పరిటాల రవి తనకు సోదర సమానుడైన వ్యక్తి అని అలీ పేర్కొన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి పుట్టబోడని పుట్టడు కూడా అని ఇది అతిశయోక్తి కాదని మోహన్ బాబు వెల్లడించారు.మేజర్ చంద్రకాంత్ సినిమాను ఎన్టీఆర్ తో కలిసి తీయాలని ఆశ కలిగిందని మోహన్ బాబు పేర్కొన్నారు.మోహన్ బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియాలో నటిస్తుండగా డైమండ రత్నబాబు ఈ సినిమాకు కథ అందించారు.