నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ’. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అయ్యి ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో నందమురి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అందరు పెట్టుకున్న అంచనాలను బాలయ్య, బోయపాటి వమ్ము చేయలేదు.చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
ఇక ఈ సినిమా విజయం అందరికి ఒక ఊరటలా ఉంది.ఎందుకంటే కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది.
ఇక ఇటీవలే సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.అయినా కూడా హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి వెనకడుగు వేశారు.
కారణం.కరోనా వల్ల ప్రేక్షకులు థియేటర్స్ కు రారేమో అని చాలా భయపడ్డారు.
అయితే కరోనా తర్వాత టాలీవుడ్ లో విడుదల అయినా పెద్ద సినిమా బాలయ్య అఖండ నే.ఈ సినిమా రిజల్ట్ మీదనే మిగతా సినిమాలు ఆధారపడి ఉన్నాయి.
అందుకే ఈ సినిమా హిట్ అవ్వడంతో మిగతా హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.ఇక ఈ డిసెంబర్ లో చాలా సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇక తాజాగా అఖండ విజయం పై మోహన్ బాబు స్పందించారు.”సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు.చూడరు అనుకుంటున్న ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన అఖండ సినిమా టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఊపిరి పోసింది.ఇంకా విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలకు ధైర్యాన్ని ఇచ్చింది.
నా సోదరుడు బాలయ్యకి చిత్ర యూనిట్ కి అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నాను.అలాగే మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు అంటూ అఖండ సినిమాపై మోహన్ బాబు తనదైన శైలిలో ప్రసంసలు కురిపించారు.