డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓం రావత్ దర్శకత్వంలో హిందీలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్.రామాయణంలోని ఒక కథాంశం తీసుకొని ఈ సినిమాని చేస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు ప్రకటించాడు.
ఇక ఈ సినిమాలో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ కనిపించబోతూ ఉండగా ప్రతినాయకుడైన రావణుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా మెజారిటీ షూటింగ్ మొత్తం స్టూడియోలో జరుగుతుందని తెలుస్తుంది.
కంప్లీట్ విఎఫ్ఎక్స్ తో త్రీడీ వెర్షన్ లో మూవీని ఆవిష్కరించబోతున్నారు.ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలకి ఉపయోగించిన విఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఆది పురుష్ కోసం ఉపయోగిస్తూ రామాయణ కాలం నాటి నేటివిటీని ప్రెజెంట్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్ర కోసం కీర్తి సురేష్, కియారా అద్వానీలలో ఒకరిని కన్ఫర్మ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.ఇక అయితే బి-టౌన్ ప్రేక్షకులని దృష్టిలో ఉంచుకొని కియారానే ఫస్ట్ ఆప్షన్ గా చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది.ఇందులో విశ్వామిత్రుడు పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఫైనల్ చేసినట్లు సమాచారం.
సినిమా కథాంశం ప్రకారం విశ్వామిత్రుడు పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని, దాని కోసం మంచి ఆహార్యం, గంభీరమైన స్వరంతో ఉన్న మోహన్ బాబు పెర్ఫెక్ట్ అని అతనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇక సినిమా షూటింగ్ కేరళ, శ్రీలంక ఫారెస్ట్ లో మెజారిటీ షూట్ చేస్తారని సమాచారం.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న టి-సిరీస్ త్వరలో సినిమాకి సంబంధించి అన్ని విషయాలు ప్రకటించనున్నట్లు టాక్.