మోహన్బాబు నట కెరీర్లోనే కాకుండా ఆయన నిర్మాతగా కూడా ఎంతో లాభం పొందిన సినిమా పెదరాయుడు.ఆ సినిమా వచ్చి ఇటీవలే పాతికేళ్లు పూర్తి అయ్యింది.
ఆ సందర్బంగా మోహన్బాబు సోషల్ మీడియాలో హడావుడి చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు.
ఈమద్య కాలంలో నటుడిగా తక్కువ సినిమాలు చేస్తున్నందుకు అసంతృప్తిగానే ఉన్నా కూడా మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు.
ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత ఒక ఫ్యామిలీ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మోహన్బాబు చెప్పుకొచ్చాడు.పెదరాయుడు రేంజ్లో ఒక చిత్రం చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
చాలా సంవత్సరాల క్రితమే పెదరాయుడు సినిమాకు సీక్వెల్ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించాడు.కాని ఈతరం ప్రేక్షకులకు పెదరాయుడు చిత్రం ఎక్కక పోవచ్చు అనే ఉద్దేశ్యంతో వదిలేశాడు.
మళ్లీ ఇన్నాళ్లకు పెదరాయుడు సినిమాకు సంబంధించిన ప్రకటన రావడంతో జనాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు వద్దనుకున్న పెదరాయుడు సినిమాను మళ్లీ ఇప్పుడు చేస్తే మాత్రం ప్రేక్షకులు చూస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.పెద రాయుడు తరహాలో కాకుండా మరేదైనా కథతో ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్తో కూడిన స్క్రీన్ప్లేతో సినిమాను చేస్తే మాత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.