కొన్ని రోజుల క్రితం ఆచార్య సినిమా లో మోహన్ బాబు నటించబోతున్నాడు అంటూ తారా స్థాయిలో వార్తలు వచ్చాయి.ప్రముఖ స్టార్స్ కూడా ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.
దాంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.అంచనాలకు తగ్గట్లుగా వీరిద్దరితో దర్శకుడు కొరటాల శివ మంచి సినిమాను చేస్తాడు అంటూ అంతా అనుకున్నారు.
కాని అనూహ్యంగా సినిమా లో తాను నటించడం లేదు అంటూ మోహన్ బాబు తేల్చి చెప్పాడు.సన్నాఫ్ ఇండియా సినిమాలో మినహా నేను మరే సినిమాలో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో మోహన్ బాబు ఉంటాడు అనే విషయం నిజం కాదని కొందరు అనుకున్నారు.అనుకున్నట్లుగానే మోహన్ బాబు తాను ఆచార్యలో నటించడం లేదు అంటూ తేల్చి చెప్పాడు.
చిరంజీవి మరియు మోహన్ బాబుల మద్య ఆమద్య కాస్త గ్యాప్ ఏర్పడింది.దాంతో ఇండస్ట్రీలో రెండు వర్గాలు గా విడిపోయారు అంటూ విమర్శలు వచ్చాయి.ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన మేము ఇలా విడిపోవడం కరెక్ట్ కాదని ఇద్దరు ఆలోచించి చివరకు కలిసి పోయారు.ఇద్దరు కూడా సినిమాల్లో నటించేంతగా స్నేహంగా మారారు.కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్నాము అంటూ పలు సందర్బాల్లో ఇద్దరు చెప్పారు.కనుక ఆచార్యలో మోహన్ బాబు ఉంటాడేమో అంటూ అంతా అనుకున్నారు.
కాని అది నిజం కాదని తేలిపోయింది.ఆమద్య చిరు మంచు విష్ణులు కలిశారు.
కనుక ఇద్దరి కాంబో సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ఖచ్చితంగా వీరిద్దరి కాంబో మూవీ ఉంటుందని అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.