నా ఇల్లు తాకట్టు పెట్టి మరీ వారికి డబ్బులు చెల్లిస్తున్నా.. అంటున్న మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు తన నటనతో ప్రేక్షకుల వద్ద ఎప్పుడో మంచి మార్క్స్ వేయించుకున్నారు.మోహన్ బాబు తన నటనతోనే కాక శాంతినికేతన్ ద్వారా ఎంతోమందికి విద్యా దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 Mohan Babu Mortaged His House To Pay Salaries To Staff, Fee Reimbursement, Colle-TeluguStop.com

అందుకే ఆయనకు కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారాలను ఇచ్చి సత్కరించింది.అలాంటి మోహన్ బాబు గారు తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

మోహన్ బాబు శాంతినికేతన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు రకరకాల కోర్సులు కూడిన విద్యను అందిస్తున్నారు.ఇక్కడ చదివే చాలామంది విద్యార్థులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్స్‌మెంట్ ద్వారా చదువుతున్నారు.

అయితే చాలారోజుల నుండి ఫీజ్ రియంబర్స్‌మెంట్ బకాయిలు ఉండడంతో నిర్వహణ వ్యయం కష్టమైపోతుందని ఈ టైంలో స్టాఫ్ కు జీతాలు చెల్లించడానికి ఆయన తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ వాళ్లకు డబ్బులు చెల్లించినట్లు తెలిపారు.

గతంలో కూడా సరిగ్గా ఎన్నికల ముందు మోహన్ బాబు ఇలాంటి కామెంట్స్ చేశారు.

ఆ టైంలో టీడీపీ శ్రేణులు ఆయన మీద సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు.తాజాగా ఈ అంశంపై మరోమారు మోహన్ బాబు గారు స్పందించడం పెద్ద చర్చకు తెర లేపినట్లు అయింది.

కరోనా టైంలో మిగతా విద్యా సంస్థలు తమ స్టాఫ్ కి జీతాలు చెల్లించలేక వాళ్ళని ఉద్యోగాల నుండి తీసేస్తుంటే మోహన్ బాబు మాత్రం ఈ టైంలో కూడా స్టాఫ్ కి ఫుల్ శాలరీస్ చెల్లిస్తూ వారికి అండగా నిలవడం అందరికీ ఆదర్శనీయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube