ఇటీవలే వైకాపాలో జాయిన్ అయిన మోహన్బాబు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు.గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడుపై ఏకథాటిగా విమర్శలు చేస్తున్న మోహన్బాబు తాజాగా మరో సంచలన విషయాన్ని బయట పెట్టాడు.
ప్రస్తుతం నారా వారికి వేల కోట్ల రూపాయలను తెచ్చి పెడుతున్న సంస్థ హెరిటేజ్ అసలు నాది అని, అప్పట్లో నాకు వెన్ను పోటు పొడిచి చంద్రబాబు నాయుడు తనకున్న పరపతితో సంస్థను దక్కించుకున్నాడు అంటూ మోహన్బాబు సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు.
హెరిటేజ్ సంస్థను చంద్రబాబు, నేను మరో మిత్రుడు కలిసి ఏర్పాటు చేశాం.సంస్థలో ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టింది నేను.ఆ తర్వాత బాబు, ఆ తర్వాత తమ మిత్రుడు పెట్టాడు.
సంస్థ అభివృద్ది చెందుతున్న సమయంలో నేను సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను.ఆ సమయంలో సంస్థకు సంబంధించిన వ్యవహారాలు నేను ఎక్కువగా పట్టించుకోలేక పోయేవాడిని.
అదే అదునుగా చూసుకుని కొన్ని వైట్ పేపర్స్పై సంతకాలు చేయించుకున్నాడు.నాకు ఏవో మాయ మాటలు చెప్పి సంతకాలు తీసుకున్నాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకు నన్ను హెరిటేజ్ సంస్థ నుండి బయటకు పంపించారు.
అప్పట్లో సంస్థ చిన్నది, పెట్టిన పెట్టుబడి కూడా తక్కువ అవ్వడంతో ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందని భావించి వదిలేశాను.కోర్టుల చుట్టు తిరిగినా కూడా బాబుకు ఉన్న పరపతితో హెరిటేజ్లో నాకు చిల్లి గవ్వ కూడా రాకుండా చేశాడు.ఈ విషయంలో తాను ఎక్కడ కుటుంబ సభ్యుల మీద ఒట్టు వేయమన్నా కూడా నేను సిద్దం.
మరి చంద్రబాబు నాయుడు ఒట్టు వేసేందుకు సిద్దమా అంటూ మోహన్బాబు సవాల్ విసిరాడు.