నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు ఇండస్ట్రీలో సత్తా చాటారనే సంగతి తెలిసిందే.దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు 72 సినిమాలను నిర్మించారు.రజనీకాంత్ కు సన్నిహితుడైన మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తారు.2007 సంవత్సరంలో మోహన్ బాబు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.స్వర్గం నరకం సినిమాతో మోహన్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తాజాగా మోహన్ బాబు తన తల్లి గురించి చెబుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తన తల్లి లక్ష్మమ్మ గురించి చెబుతూ తన తల్లికి పుట్టి చెవుడు అని తెలిపారు.బిడ్డ ఏడుపును విని తల్లి ఆకలిని తీరుస్తుందని తన తల్లి మాత్రం తనకు మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పిందని మోహన్ బాబు చెప్పారు.
తన తల్లి తనకు నడకతో పాటు నడతను కూడా నేర్పిందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
ఐదుగురు సంతానాన్ని తన తల్లి పెంచి పెద్ద చేసిందని తల్లిగురించి గొప్పగా మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.గత కొన్నేళ్లుగా మోహన్ బాబు పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం.గమనార్హం.కెరీర్ తొలినాళ్లలో మోహన్ బాబు కొన్ని సినిమాలో విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో కూడా నటించారు.
మోహన్ బాబు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్నారు.మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ నటిగా ప్రూవ్ చేసుకోవడంతో పలు టీవీ షోలకు చేసుకున్నారు.
మోహన్ బాబు రాజ్యసభ సభ్యునిగా కూడా పని చేశారు.మోహన్ బాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.