అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా ప్రకాష్ రాజు ప్యానల్ పై మంచు విష్ణు అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిచాడు.ఈ క్రమంలోనే మంచు విష్ణు విజయం తర్వాత నటుడు మోహన్ బాబు స్పందించారు.
మంచు విష్ణు గెలుపు ఒక్కరిదే కాదని ఇది అందరి గెలుపు అంటూ మోహన్ బాబు తెలియజేశారు.ఈ విషయం ప్రతి ఒక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు అని తెలిపారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి విష్ణు గెలవడం సంతోషం అయినప్పటికీ, ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా విష్ణు ఎన్నో హామీలను ఇచ్చారు.ఆ హామీలు అన్నింటిని నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు తెలియజేశారు.
ఇప్పటివరకు అందరి మధ్య ఏర్పడిన మనస్పర్థలను మరిచిపోయి అందరం ఒకే తల్లి బిడ్డలం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
మంచు విష్ణు విజయం వెనక నరేష్ పాత్ర ఎంతో కీలకమైనదని అతడు వంద సంవత్సరాలు చల్లగా జీవించాలని ఈ సందర్భంగా మోహన్ బాబు తెలిపారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా బిడ్డ పై ఉందని వారి ఆశీర్వాదం వల్లే నేడు అధ్యక్ష పీఠం అధిరోహించాడని,ఎన్నికల పోటీ సమయంలో విష్ణు మేనిఫెస్టోలో చెప్పిన అభివృద్ధి పనులన్నింటినీ చేస్తేనే తను పదవికి న్యాయం చేసినవాడు అవుతారని ఈ సందర్భంగా మోహన్ బాబు తెలిపారు.ఇకపై ఎప్పుడు కూడా మా ఎన్నికలలో ఈ విధమైనటువంటి పోటీలు లేకుండా ఏకగ్రీవంతో జరగాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు
.