అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రముఖ సీరియల్ దర్శకురాలు మంజుల నాయుడు దర్శకత్వం వహించిన “చక్రవాకం” అనే ధారావాహిక ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ ధారావాహికలో హీరోగా నటించినటువంటి సీరియల్ నటుడు ఇంద్రనీల్ వర్మ అలియాస్ ధర్మ గురించి తెలియనివారుండరు.
అయితే తాజాగా ఇంద్రనీల్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో తాను చక్రవాకం సీరియల్ లో నటిస్తున్న సమయంలో అదే సీరియల్ లో హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన మేఘన రామి తో ప్రేమలో పడి ఆమెనే పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత కొందరు చక్రవాకం సీరియల్ లో తనకు అత్త పాత్రలో నటించిన నటిని పెళ్లి చేసుకున్నాడంటూ కొంతమేర ఎద్దేవా చేశారని చెప్పుకొచ్చాడు.
అంతేకాక పెళ్లి అయిన సమయంలో మేఘన రామి కొంతమేర బరువు ఎక్కువ ఉండేదని ఆ విషయం పై కూడా తనని కొందరు అప్పుడప్పుడు సూటిపోటి మాటలతో గాయ పరిచే విధంగా మాట్లాడేవారని, కానీ తమ అన్యోన్య దాంపత్యం గురించి తెలిసినవారు ఎవరూ అలా మాట్లాడరని తెలిపాడు.నిజంగా మేఘన రామి లాంటి భార్య తనకు దొరకడం చాలా అదృష్టం అని తనని ఎంతగానో ప్రేమిస్తున్నానని అంటూ ఆమెపై ఉన్నటువంటి ప్రేమని వ్యక్తపరిచాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా మేఘన రామీ ప్రస్తుతం తెలుగు బుల్లితెరలో తన హవాను కొనసాగిస్తోంది.కాగా తెలుగులో దాదాపుగా ఎనిమిదికి పైగా ధారావాహికలలో నటించి ప్రేక్షకులని బాగానే మెప్పించింది.
అయితే ప్రస్తుతం ఆమె జీ తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి “రాధమ్మ కూతురు” సీరియల్ లో హీరోయిన్ తల్లి పాత్రలో నటిస్తోంది.ఏదేమైనప్పటికీ ఒకప్పుడు ఇంద్రనీల్ మేఘన రామి జంటను చూసి హేళన చేసినటువంటి వారే ప్రస్తుతం వారిద్దరి అన్యోన్య దాంపత్యం చూసి ముక్కున వేలేసుకున్నారు.