గతంలో బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పటికీ ఈ సీరియల్ లో నటించిన నటీనటులను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
ఇక ఈ సీరియల్ లో దయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్రనాథ్.నిజ జీవితంలో మాత్రం క్రూరమైన వ్యక్తిగా నిలిచాడు.
ఇదిలా ఉంటే ఇతడి రాసలీలల గుట్టంతా తన భార్య తాజాగా బయటపెట్టింది.
మొగలిరేకులు సీరియల్లో దయ పాత్రలో నటించిన ఇతగాడికి నిజ జీవితంలో దయ అనేదే లేదు.
భార్య ఉండగానే అమ్మాయిలతో రాసలీలలు చేస్తూ భార్యను దారుణంగా హింసిస్తున్నాడు.ఇక ఈ విషయాన్ని తాజాగా తన భార్య శశిరేఖ మీడియా ముందు బయటపెట్టింది.
తమకు 2009లో పెళ్లయిందని అంతేకాకుండా తమకు 11 ఏళ్ళ పాప, 8 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపింది.
తమకు మ్యాట్రిమోనీ ప్రొఫైల్ ద్వారా పెళ్లి జరిగిందని మొదట్లో బాగానే ఉన్నాడని కడుపులో బిడ్డ పడ్డాక అతనిలో కామ పిచాచి బయటపడిందని తెలిపింది.
తన ముఖం చూస్తే చిరాకు పడుతూ ఉంటాడని అతడికి పెళ్లయినప్పటి నుంచి అమ్మాయిల పిచ్చి ఉందని అంతేకాకుండా అతడు జాతకాలు చెప్పడంతో అతని దగ్గరికి చాలామంది అమ్మాయిలు వస్తుంటారని తెలిపింది.
ఇక నేరుగా తమ ఇంటికి పిలిపించుకొని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్తాడని గంటలు గంటలు అయినా బయటకు రాడని తెలిపింది.తనని ఇవన్నీ ఏంటి అని అడిగితే బాగా తిట్టేవాడని, కొట్టేవాడని తెలిపింది.పైగా తమ అత్త మామయ్యలు కూడా అతనికే సపోర్ట్ చేసే వాళ్ళని తల్లి పెళ్లయిన ఏడాదికే ప్రెగ్నెంట్ ఉండగానే బయటికి పంపించారని తెలిపింది.
ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇల్లు కొందామని తనను నమ్మించి తన నగలన్నీ అమ్మిస్తే మణికొండలో కొన్నారని తెలిపింది.అయినా కూడా అతడిలో మార్పు లేదని ఇంటికి సరిగ్గా రాకుండా ఉండేవాడని పిల్లలను అసలు పట్టించుకోడని అందుకే తానే కష్టపడి జాబ్ సందించుకున్నానని తెలిపింది.
అతడు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని ఆ అమ్మాయే తనతో అన్ని వివరాలతో సహా చెప్పిందని తెలిపాడు.
ఈ విషయం తమ అత్త మామ వాళ్లకి చెప్పినా కూడా వాళ్లు పట్టించుకోలేదని తనను పదేళ్లు టార్చర్ చేశాడని ఇప్పటికీ తన బతుకు తనను బతకనివ్వడంలేదని వాపోయింది.తనను ఉద్యోగం కూడా చేయనియడం లేదు అంటూ విడాకులు కూడా ఇవ్వట్లేదు అంటూ ఇలాంటి వాళ్లను అరెస్టు చేయాలని కోరింది.పిల్లలు పుట్టిన తర్వాత నుంచి తనతో మాట్లాడటమే మానేశాడని ఏదైనా మాట్లాడాలి అంటే మధ్యలో ఒక వ్యక్తి ఉండేవాడని తెలిపాడు.
ఇక తనను బాగా గోడకేసి కొట్టేవాడని తెలిపింది.అతడికి నాలుగేళ్ల క్రితం హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆపరేషన్ తర్వాత మళ్లీ తాగడం మొదలు పెట్టాడని తెలిపింది.తమకు రెండు ఇల్లులు ఉన్నాయని ఆ ఇళ్లను అమ్మేసి తనకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పిల్లల పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేయమని అడిగింది.ఇలాంటి దుర్మార్గుడి కి శిక్ష పడాలని అందుకే అతడిపై కేసు పెట్టానని తెలిపింది.
ప్రస్తుతం పవిత్ర నాథ్ జీ తెలుగులో ప్రసారమవుతున్న కృష్ణ తులసి మల్లికార్జున్ అనే విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.