సెకండ్ వేవ్ అంటూ మోడీ సెన్సేషనల్ కామెంట్స్..!!

గత కొద్ది కాలం నుండి ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఈసారి చాలా కఠినంగా అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలకు కీలక సూచనలు ఇచ్చారు.

 Modis Sensational Comments On Second Wave-TeluguStop.com

కేసులు పెరిగే ప్రతి ప్రాంతంలో మైక్రో కంటెంట్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.అదేవిధంగా ప్రజలను భయాందోళనకు గురి చేయకూడదు అంటూ స్పష్టం చేశారు.

కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే అనేక దేశాలలో రావడం జరిగిందని, ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ ఈ సమావేశంలో మోడీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.కొన్ని రాష్ట్రాల్లో ఊహించని విధంగా కేసులు పెరిగిపోయాయని స్పష్టం చేశారు.

మరొకసారి ప్రజలకు సుపరిపాలన అందించే సమయం ఆసన్నమైందని అందరూ కలిసికట్టుగా పని చేయాలి, అతి విశ్వాసానికి పోకుండా ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలని సూచించారు.దేశవ్యాప్తంగా దాదాపు 70 జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉందని ఇలాంటి టైమ్ లో జాగ్రత్తలు తీసుకోకపోతే మరోసారి కరోనా పంజా విసరడం గ్యారెంటీ అని మోడీ స్పష్టం చేశార.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube