దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.అయినాగాని కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.
దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో బయటపడుతూ ఉండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేసులు ఎక్కువగా ఉన్నా జిల్లాలో లాక్ డౌన్ అమలు చేస్తూ , రాత్రిపూట రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ఉంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న కొద్ది కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు దేశంలో సెకండ్ వేవ్ మళ్లీ స్టార్ట్ అయినట్లు వార్తలు రావడంతో బెంబేలెత్తిపోతున్నారు జనాలు.
తరుణంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మహమ్మారి కి సంబంధించి భేటీ అయిన ప్రధాని మోడీ రేపు మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కాబోతున్నారు.ఈ నేపథ్యంలో జరగబోయే ఈ సమావేశంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చాలావరకూ ప్రజలలో కరోనా భయం లేకుండా ఉండటంతోపాటు మాస్కులు కూడా ధరించకుండా బయటకు వస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.