ఒలంపిక్స్ లో పోటీపడుతున్న క్రీడాకారులకు బెస్ట్ విషెస్ చెప్పిన మోడీ..!!

మరికొద్ది రోజుల్లో టోక్యో నగరంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ ఒలంపిక్స్ క్రీడలకు రెడీ అయిన భారత్ ఆటగాళ్లు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది మందికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 Modi Wishes Best Wishes To Athletes Competing In Olympics,  Modi, Olympics, Toky-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా వర్చువల్ విధానం ద్వారా 17 మందితో మోడీ భేటీ కావడం జరిగింది.

ఈ సందర్భంగా తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మాట్లాడిన మోడీ ప్రాక్టీస్ ఏ విధంగా చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఒలంపిక్స్ ఆడి వచ్చిన తర్వాత పివి సింధు కి ఐస్క్రీమ్ ట్రీట్ ఇప్పిస్తా అంటూ మోడీ ఈ సమావేశంలో తెలియజేశారు.బ్రెజిల్ ఒలంపిక్స్ లో గతంలో సిల్వర్ గెలిచిన పి.వి.సింధు ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పై దృష్టి పెట్టారు.ఇదే సమయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తో కూడా మోడీ ముచ్చటించారు.జూలై 23 నుండి టోక్యో ఒలింపిక్స్ మొదలు కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube