మరికొద్ది రోజుల్లో టోక్యో నగరంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ ఒలంపిక్స్ క్రీడలకు రెడీ అయిన భారత్ ఆటగాళ్లు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది మందికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇదిలా ఉంటే తాజాగా వర్చువల్ విధానం ద్వారా 17 మందితో మోడీ భేటీ కావడం జరిగింది.
ఈ సందర్భంగా తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మాట్లాడిన మోడీ ప్రాక్టీస్ ఏ విధంగా చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒలంపిక్స్ ఆడి వచ్చిన తర్వాత పివి సింధు కి ఐస్క్రీమ్ ట్రీట్ ఇప్పిస్తా అంటూ మోడీ ఈ సమావేశంలో తెలియజేశారు.బ్రెజిల్ ఒలంపిక్స్ లో గతంలో సిల్వర్ గెలిచిన పి.వి.సింధు ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పై దృష్టి పెట్టారు.ఇదే సమయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తో కూడా మోడీ ముచ్చటించారు.జూలై 23 నుండి టోక్యో ఒలింపిక్స్ మొదలు కానున్నాయి.