వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి…దీదీగా పిలవబడే నేత మమత బెనర్జీ కు భారత ప్రధాని మోడి.మరో గట్టి షాక్ ఇచ్చారు.
ఆపరేషన్ ఆకర్శ పేరుతో మోడి చేసిన ప్రయోగం ఫలించింది.అసలేం జరిగిందంటే…ఎంపి సృంజన్, టిఎంసి నాయకురాలు, మహిళా కమిషన్ సభ్యురాలు, నటి లాకెట్ చటర్జీలను మోడి తన పాకెట్ లో వేసుకునే ప్రయత్నం చేయగా…మోడి మాటలకు ఆకర్షితులైన వీరు…పార్టీకి రాజీనామా చేశారు.
అంతేకాకుండా వీరు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.ఇక సరిగ్గా గమనిస్తే టిఎంసి నుంచి ఎంపిలను ఆకర్షించడంలో మోడీ దీదీని మొదటి నుంచి దెబ్బ తీస్తూనే ఉన్నారు.
అసలు విషయానికి వస్తే…శారదా కుంభకోణంలో నిందితుడు సృంజన్ జైలు నుంచి బెయిలుపై బయటికి రాగానే ఆయన తన పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.వస్తున్న కథనాల మేరకు ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం అదే విధంగా లాకెట్ చటర్జీ కూడా బీజేపీతో ఒప్పందం కుదుర్చకున్నట్లు తెలుస్తోంది.
సృంజన్ జైలు ఉండగానే తనపై వస్తున్న అభియోగాల విషయం మరింత లోతుకు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా ముందుగానే బేరం కుదర్చుకున్నట్లు సమాచారం.పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీనీ దెబ్బతీయాలంటే ఇలాంటి నాయకులను ముందు లాగి మానసికంగా దెబ్బతీయాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుంది.
మరి ఇదే జరిగితే రానున్న రోజుల్లో దీదీ కోటకు బీటలు తప్పవేమో.