మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటంతో హాస్పిటల్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కరోనా బారినపడిన మన్మోహన్సింగ్ తర్వాత కోలుకున్న గా మళ్లీ ఇటీవల ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించటంతో కుటుంబ సభ్యులు ఏయిమ్స్ హాస్పత్రి లో జాయిన్ చేశారు.
జ్వరం రావడంతో హుటాహుటిన.హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది.
ఈ తరుణంలో మన్మోహన్ ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వటం జరిగింది.
సాధారణ జ్వరం నుండి పూర్తిగా ఆయన కోలుకున్నట్లు రెస్ట్ తీసుకుంటున్నట్లు త్వరలోనే డిశ్చార్జి కానున్నట్లు స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని మోడీ.మన్మోహన్ ఆరోగ్యానికి సంబంధించిన వార్త పై సోషల్ మీడియాలో స్పందించారు.ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇక ఇదే తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్.ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి… మన్మోహన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడం జరిగింది.
ఈ క్రమంలో మన్మోహన్ త్వరగా కోలుకోవాలని రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు కోరుకుంటున్నారు.