ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని.
జీవో నెంబర్ 317 రద్దు చేయాలనీ… దీక్షలు చేపట్టగా పోలీసులు… ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది.ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టులో హాజరుపరచగా బండి సంజయ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్.
విధించగా అనంతరం హైకోర్టు బండి సంజయ్ కి బెయిల్ ఇవ్వడం తెలిసిందే.ఈ క్రమంలో బండి సంజయ్ అరెస్టు పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బండి అరెస్ట్ వ్యవహారం పొలిటికల్ గా వైరల్ అయింది.దీంతో బండి సంజయ్ అరెస్ట్ నిరసనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా.
ఆందోళన చేపట్టాలని హైదరాబాదుకి రాగా పోలీసులు.అడ్డుకోవడం జరిగింది.
ఇటువంటి తరుణంలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ వ్యవహారం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లడం జరిగిందట.
దీంతో తాజాగా ప్రధాని మోడీ బండి సంజయ్ కి ఫోన్ చేసి దాదాపు పదిహేను నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలంగాణలో.రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నరట.
ఇదే తరుణంలో దీక్ష మరియు అరెస్ట్ వ్యవహారాలు గురించి కూడా చర్చించినట్లు సమాచారం.