నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాపం పాకిస్తాన్ కి గడ్డుకాలం నడుస్తుంది.ఆ గడ్డు కాలం నుండి తప్పించుకోవడానికి పాక్ చేసిన ప్రయత్నాలన్నిటిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది.
దీంతో అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్న, తమ బుద్ధిని మాత్రం పాకిస్తాన్ అస్సలు మార్చుకోవట్లేదు.దాని ఫలితంగా ఇప్పటికే విదేశాలనుండి తిట్లు తింటున్నా పాకిస్తాన్ తాజాగా సొంత దేశంలో కూడా వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది.
రాడికల్ ఇస్లాంను తమ దేశంలో కంట్రోల్ చేస్తామని మాటలు చెప్పడమే కాకుండా దానికి తగినన్ని చర్యలు తీసుకుంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మ్యాక్రన్ ధోరణిని వ్యతిరేకిస్తున్న పాక్ ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశంపై స్పందించింది.ఫ్రాన్స్ తమ ధోరణిని మార్చుకోవాలని లేకుంటే వారి ఉత్పత్తులను బ్యాన్ చేస్తామని హెచ్చరించింది.
ఫ్రాన్స్ ను ఉద్దేశిస్తూ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి మాట్లాడుతున్న సమయంలో బెలూచిస్తాన్ కు చెందిన ఎంపీలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కీర్తిస్తూ,మాకు పాకిస్తాన్ నుండి ఆజాది కల్పించండి అంటూ నినాదాలు చేశారు.ఇలా ప్రతిపక్ష నాయకులు సురేష్ ఈ ప్రసంగానికి అస్తమానం అడ్డుతగలడంతో సహనం కోల్పోయిన ఖురేషి మీకు సిగ్గు లేదా అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.