ప్రముఖ అంతర్జాతీయ పత్రిక టైం మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ముగ్గురు గ్లోబల్ లీడర్లను భారత్ నుంచి ఎంపిక చేసింది.మొత్తం 50 మందిని ఎంపిక చేయగా వారిలో ప్రధాని నరేంద్ర మోడీ, రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉన్నారు.
వీరు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు.ప్రభావశీలురుగా ప్రశంసలు పొందారు.
వీరిని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేయడానికి కారణాలు టైం మ్యాగజైన్ వివరించింది.ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాను ఆధునీకరించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు.
రెండోది అమెరికాకు నచ్చే విషయం.మోడీ ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలు చాలా వేగంగా అమలు చేస్తున్నది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బాగా ప్రోత్సహిస్తున్నది.విదేశాలకు కావలసింది ఇదే.అందుకే ఆయన్ను గ్లోబల్ లీడరుగా ఎంపిక చేశారు.ముకేష్ అంబానీని ఎంపిక చేయడానికి కారణం ఆయన ఇండియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త.
సుందర్ పిచాయ్ సాంకేతిక రంగంలో ప్రతిభావంతుడు.ఈ ముగ్గురు ప్రస్తుతం పోటీలో ఉన్నారు.
టైం పత్రిక రీడర్స్ వీరిని ఎన్నుకుంటారు.వీరిలో ఎవరు విజేతలుగా ఉంటారో.