దేశ ప్రధాని నరేంద్ర మోడి తేజ్ పూర్ యునివర్సిటి స్నాతకోత్సవం సందర్భంగా యువత లో స్పూర్తి కలిగించే మాటలను చెప్పారు.ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ను ఉదాహరణగా వివరించాడు.
నేటి యువత ఎలా ఉన్నారు అంటే వారికి ఎదురయ్యే ప్రతి సమస్య ను సవాలుగా స్వీకరించి బయటపడుతున్నారు.అంచనాలకు మించి నేటి యువత పని చేస్తుంది.
జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదురించి నిలబడాలో అనేదానికి ఆస్ట్రేలియా తో ఇండియా గెలిచిన టెస్ట్ మ్యాచ్ ను ఉదాహరణగా తీసుకొని చెప్పాడు.
మీలో చాలా మంది ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ చూసి ఉండవచ్చు టెస్ట్ సిరీస్ ఆరంభం కు ముందు ఇండియా పూర్తి స్థాయి లో ఫిట్ గా ఉంది.
అయిన ఫస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం.ఆ పరాజయం నుండి మనవాళ్లు త్వరగా తేరుకొని సెకండ్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం ను అందించారు.ఆ తర్వాత మ్యాచ్ కు ముందు చాలా మంది గాయాలతో దూరం అయ్యారు ఉన్న 11 మంది కూడా అనుభవం లేని వారు అయిన సవాళ్లను ఎదుర్కొని నిలుచున్నారు.ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని పోరాట ప్రతిమ చూపించారు.
లాస్ట్ టెస్ట్ ఆడిన చాలా మందికి అనుభవం కూడా లేదు అయిన వారిలో గెలుస్తాం అనే నమ్మకం ఉంది.అందుకే ఆ మ్యాచ్ తో చరిత్రలో నిలిచిపోయారని నరేంద్ర మోడి అన్నాడు.
.