నరేంద్ర మోడి…కొంగ్రెస్ పార్టీ ని ప్రక్షాళన చేసి దాదాపుగా 10ఏళ్ల కొంగ్రెస్ బానిసత్వం నుంచి దేశాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి.ఇదీ మోడి పై ప్రజలకు ఆనాడు ఉన్న విశ్వాసం.
అయితే ఇదిలా ఉంటే…మోడి సైతం… ప్రధాన మంత్రి అయిన తరువాత… సాదాసీదా రాజకీయ నాయకుడిలా కాకుండా.డ్రస్ సెన్స్ మెయింటైన్ చేస్తూ యూత్ కి ఒక ఐకాన్ గా మారిపోయారు.
ఇతవరకు బాగానే ఉంది కానీ…దాదాపుగా ఒక ఆరు నెలలు మోడి హవా బాగానే నడిచింది.ఇక ఆ తరువాత మొదలయింది ఆయన పతనం.
ఇక ఢిల్లీ ఓటమి మోడీ క్రేజ్ పై తీవ్ర ప్రభావం చూపింది.అప్పటివరకూ ఆహా .ఓహో అని పొగిడిన వారే.విమర్శించడం మొదలుపెట్టారు.
మోడీ అహంభావ రాజకీయాల వల్లే ఢిల్లీలో ఘోర పరాజయం చవిచూడక తప్పలేదన్నవారే ఎక్కువయ్యారు.ఈ సమయంలో ఆంధ్రాకు చెందిన ఓ నేత మాత్రం ఇంకా మోడీ క్రేజ్ తగ్గలేదనే చెబుతున్నారు.
ఆమే పురంధేశ్వరి.బీజేపీలో లేటుగా చేరినా.
మోడీపై మాత్రం అచంచంల విశ్వాసం ప్రదర్శిస్తున్నారు.ఢిల్లీ ఫలితాలు కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని ఆమె అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీలో బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉందని.ఇతర పార్టీల ఓట్లు ఆప్కు రావడంవల్లే.
ఆ పార్టీ ఘన విజయం సాధించిందని విశ్లేషించారు.ఢిల్లీ ఫలితాలు ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమని… కేంద్ర పాలనకు రెఫరెండం కాదని చెప్పుకొచ్చారు.
మోడీ హవా ఏమాత్రం తగ్గలేదని పురంధేశ్వరి వెనుకేసుకొచ్చారు.మరి డిల్లీ ఎన్నికలు మోడి అండ్ బ్యాచ్ కి కనువిప్పును కలిగిస్తాయో లేదో చూడాలి.