ప్రధాని మోడీ అదేవిధంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల హైదరాబాద్ నగరానికి రానున్నారు.ఇక్రిశాట్ సంస్థ గోల్డెన్ జూబిలీ ఉత్సవాల్లో అదేవిధంగా రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో మోడీ పాల్గొననున్నారు.
ఈ క్రమంలో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు.ఈ విగ్రహ ఏర్పాటు 120 కిలోల బంగారంతో పాటు వెండి, రాగి, ఇత్తడి, జింక్ ఉపయోగించడం జరిగింది.
అంత మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న విగ్రహాలలో అత్యంత ఎత్తైన విగ్రహంగా… రెండో స్థానంలో ఉండి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది.మొదటి స్థానంలో థాయిలాండ్ లో బుద్ధ విగ్రహం ఉంది.
దాదాపు ఈ విగ్రహ తయారీ కోసం…వేయి కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఇదే టైం లో విగ్రహ దిగువ భాగంలో ఉండే గదిని…రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింధ్ ప్రారంభించనున్నారు.
దేశ ప్రధాని…రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.హైదరాబాద్ లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
కొన్ని రహదారులకు సంబంధించి ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.