యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది.
కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమా తరువాత ‘ఆదిపురుష్’ అనే మైథలాజికల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యాడు.
ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ను చిత్ర యూనిట్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు అవి కేవలం పుకారే అని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అప్పగించినట్లు తెలుస్తోంది.ప్రభాస్కు బాహుబలి వంటి బిగ్గెస్ట్ మూవీకి సంగీతం అందించిన కీరవాణి అయితేనే ‘ఆదిపురుష్’కు కూడా పూర్తి న్యాయం చేయగలడని చిత్ర యూనిట్ భావిస్తోందట.ఇక కీరవాణి ఈ సినిమాకు నిజంగానే సంగీతం అందిస్తున్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.కాగా ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కాగా ఈ సినిమాలో లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే పీక్స్కు చేరుకున్నాయి.