టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సభ్యులకు చాలా మందికి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలవుతుందో లేదో అని ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది.అయితే ఈ సినిమా షూటింగ్పై చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల ఆయన ప్లాస్మా దానం చేసిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా మరోసారి ఆయన ప్లాస్మా దానం చేసారు.
ఈ సందర్భంగా ఆయన చేస్తున్న చిత్రాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన రెండు ప్రాజెక్టులను చేయబోతున్నట్లు తెలిపారు.
దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాతో పాటు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించబోయే ఓ సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.దీంతో పాటు ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ తిరిగి త్వరలో ప్రారంభం కానుందని కీరవాణి తెలిపారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని, త్వరలోనే వారు ఈ సినిమా షూటింగ్ను మొదలుపెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.