పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతగా నిలిచారు వాణీదేవి.
ఇకపోతే అసెంబ్లీ ప్రాంగణంలో గేట్ నెంబర్ 8 ని వాణిదేవి కారు ఢీ కొట్టడంతో స్వల్పంగా ద్వంసం అయ్యింది.
వాణిదేవిని శాసన మండలిలో డ్రాప్ చేసి పార్కింగ్ చేస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇక ప్రమాదం జరిగిన సమయంలో కారు వాణిదేవి గన్మెన్ నడిపినట్టు తెలుస్తోంది.
ఇలా గేట్ను ఢీకొట్టిన కారు టైర్ పేలి భారీ శబ్ధం రావడంతో ఒక్కసారి అప్రమత్తమైన పోలీసులు కారు దగ్గరికి పరిగెత్తారట.
ఇక గేటును కారు బంలంగా ఢీకొట్టడంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యినట్లు తెలుస్తుంది.కాగా కారు ముందు భాగం మాత్రం ధ్వంసమైంది.
ఇక కారు నడిపిన అతనికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది.