జగన్ ప్రభుత్వంలో ఎవరికి రక్షణ లేదు ఎమ్మెల్సీ అంగర సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెంబర్ వన్ చర్చకు సంబంధించి ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం తెలిసింది.అయితే ఈ దాడికి సంబంధించి టీడీపీ( TDP )…వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

 Mlc Angara's Sensational Remarks Who Has No Defense Against Jagan Govt , Tdp, Ml-TeluguStop.com

అంతేకాకుండా ఒకరిపై మరొకరు పోలీస్ కంప్లైంట్ లు కూడా పెట్టుకుంటున్నారు.అసెంబ్లీలో దాడి ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో స్పీకర్ పై పలుమార్లు తెలుగుదేశం పార్టీ సభ్యులు దాడికి పాల్పడుతూ.సభకు ఆటంకం కలిగిస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే సోమవారం అసెంబ్లీ వెలుపలటీడీపీ ఎమ్మెల్సీ అంగర ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.జగన్( JAGAN ) ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేదు.

ఆఖరికి చట్టసభల్లోనూ మరియు శాసనమండలిలోను కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.ఈరోజు టీడీపీ సభ్యులపై దాడి అందుకు నిదర్శనమని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి చేసే ఇటువంటి చర్యలు రానున్న రోజుల్లో టీడీపీ గెలుపుకి దోహదపడతాయని ఎమ్మెల్సీ అంగర స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube