జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.శ్రావణి రాజీనామా చేయడం తన వ్యక్తిగతమన్నారు.
ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బాధను కలిగించాయని చెప్పారు.తాను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, శ్రావణి రాజకీయ కారణాలతో రాజీనామా చేశారని తెలిపారు.
తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యనించడం సరికాదని వెల్లడించారు.సమన్వయ లోపం ఉందని కౌన్సిలర్లు అవిశ్వాసం పెడతామన్న వద్దని చెప్పామన్నారు.
ఈ మేరకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించి శ్రావణికి కాల్ చేశామని తెలిపారు.ఈలోపే ఆమె మీడియా సమావేశం పెట్టి రాజీనామా చేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేశారని వెల్లడించారు.