ఈ మధ్య ఏపీలో జగన్ మీద అభిమానం చూపించేందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే తెగ ప్రయత్నిస్తున్నారు.ఎందుకంటే ఇప్పుడు ఏపీలో మంత్రుల మార్పులు ఉండటంతో ఎలాగైనా జగన్ దృష్టిలో పడాలని, తమకు మంత్రి పదవి రావాలని తెగ ఆరాట పడుతున్నారు.
ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు చాలా వరకు జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అయితే ఇదే క్రమంలో కొందరు జగన్ను దేవుడు అంటే కొలుస్తుంటే మరి కొందరేమో ఆయన్ను నిజంగానే దేవుడిని చేసేస్తూ ఏకంగా గుడి కట్టేస్తున్నారు.
మొన్నటికి మొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఏకంగా జగన్కు గుడి కూడా కట్టేశారు.అయితే ఇది అప్పట్లో రాష్ట్రంలో పెద్ద సంచలనమే రేపింది.కాగా ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించారు.జగన్కు గుడి కడితే సరిపోదని భావించి ఏకంగా జగన్పెండ్లి రోజున సర్ ప్రైజ్ ఇచ్చేందుకు భారీ ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే జగన్ దంపతులకు భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు మధుసూదన్ రెడ్డి. ఈ భారీ కటౌట్లో జగన్, భారతిలకు సంబంధించిన మూడు నాలుగు ఫోటోలతో రూపొందించారు.
ఈ భారీ కటౌట్ ల ద్వారా సీఎం జగన్ దంపతలకు ఆయన 25వ పెండ్లి రోజు విషెస్ తెలిపేందుకు ఈ విధంగా ప్లాన్ చేశారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.కాగా ఆయన ఈ విధంగా ఏర్పాటు చేసిన జగన్ దంపతుల కటౌట్ ఇప్పుడు నెట్టింట పెద్ద సంచలనం రేపుతోంది.ఎలాగైనా ఈసారి మంత్రి పదవి రాబట్టుకోవాలని ఆయన ఈ విధంగా జగన్ను కొలిచే పనిలో పడ్డారని రాజకీయాల్లో పెద్ద చర్చే సాగుతోంది.మరి జగన్ ఇలాంటి వారికి అవకాశం ఇస్తారా లేదంటే ఆయనకు షాక్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.