అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే ఎస్పీతో కలిసి భూమి పూజ చేశారు.
అయితే ఇది మున్సిపల్ శాఖకు సంబంధించిన స్థలమని, తనకు చెప్పకుండా భూమి పూజ చేయడం ఏంటని మున్సిపల్ చైర్మన్ జెసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఇది పోలీస్ శాఖకు చెందిన స్థలమైన అని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
పోలీసులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి జెసి అభ్యంతరాలను పక్కన పెట్టారు.అనంతరం ఎమ్మెల్యే జెసి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మునిసిపల్ స్థలాలను జేసీ కుటుంబీకులే చేస్తున్నారని ఆరోపించారు.వాటిలో జెసి ప్రభాకర్ రెడ్డికి వాటాలు ఉన్నాయన్న ఎమ్మెల్యే… తాడిపత్రి ఆయన జాగిర్ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.