కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోతున్నాయని బాధపడితే ఒకడు మాత్రం నా పళ్ల సెట్టు ఎక్కడో పోయిందని ఆరాటపడుతున్నాడట.ప్రస్తుతం కొందరు అధికారులతో పాటుగా ప్రజా ప్రతినిధుల తీరు ఇలాగే ఉందట.
అత్యుత్సాహంతో మతి తప్పిన వారిలా ప్రవర్తిస్తున్న వీరి తీరుకు ప్రజలకు విసుగు పుడుతుందని ప్రచారం.ఇకపోతే గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉత్సాహం ఎక్కువవగా డాక్టర్గా అవతారం ఎత్తాడట.
ఆ వివరాలు తెలుసుకుంటే.
బీజేపీ ఎమ్మెల్యే వీడీ జలవాడియా ఏకంగా కోవిడ్ పేషెంట్స్కు చికిత్స ఇస్తూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కేవలం ఐదో తరగతి వరకే చదివిన ఎమ్మెల్యే జలవాడియా కోవిడ్ సెంటర్లో ఇలా ప్రవర్తించడంతో నెటిజన్లు, విపక్ష నేతల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారట.అయితే తాను చేసిన తప్పును సమర్దించుకుంటూ ఈ అంశం పై వివరణ ఇచ్చారట.
అయినా తన పని తాను సరిగ్గా చేస్తే చాలు అది విడిచి ఇలా అనవసర రాద్దాంతాలకు పోవడం అవసరమా అంటూ కొందరు చురకలు అంటిస్తున్నారట.