రోజా ప్లాన్ బెడిసి కొట్టిందా ? అంతా ఆమె ప్లాన్ ప్రకారమేనా ?

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కాలం కలిసి వస్తున్నట్టుగా కనిపించడం లేదు.మొదటి నుంచి ఆమె రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తున్నారు.

 Mla Roja, Covid 19, Municipal Officer, Venkatrami Reddy, Masks, Roja Plan-TeluguStop.com

ఇక ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన తరువాత ఆమె వైసీపీలో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు.పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీ టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వైసీపీకి మైలేజ్ పెంచే విధంగా వ్యవహరించేవారు.

అదే సమయంలో జగన్ కు ఆమె అత్యంత సన్నిహితురాలిగా మారారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కు మంత్రి పదవి దక్కుతుందని ఆమెతో పాటు పార్టీలోనూ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగినా ఆమెకు జగన్ మంత్రి పదవి కట్టబెట్టలేదు.

దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురి అవ్వడం, ఆ తర్వాత ఆమెకు ఏపీఐఐసి చైర్మన్ గా అవకాశం కల్పించడంతో రోజా వ్యవహారం సద్దుమణిగింది అని అంతా భావిస్తున్న తరుణంలో ఆమె సొంత నియోజకవర్గం లో గ్రూపు రాజకీయాలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి.

ఒకవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి నారాయణ స్వామి నగరి నియోజకవర్గంలో పెత్తనం చేయడం రోజాకు మింగుడుపడని వ్యవహారంగా మారింది.

ఇది ఇలా ఉండగా, తాజాగా నగరి మున్సిపల్ అధికారి విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజకీయ దుమారానికి కారణం అయింది.ఏకంగా ప్రభుత్వాన్ని దూషిస్తూ ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడడం సంచలనంగా మారింది.

అయితే ఆ అధికారి ఆ విధంగా మాట్లాడటం వెనుక ఎవరున్నారు అనే విషయంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో రోజా పాత్ర ఉన్నట్లు గా ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

దీనికి కారణం నగిరి మున్సిపల్ అధికారి మాట్లాడిన మాటలే సాక్ష్యంగా కొంతమంది రోజా వ్యతిరేక వర్గీయులు చూపిస్తున్నారు.

Telugu Covid, Masks, Mla Roja, Roja-Telugu Political News

ఇప్పటి వరకు తాను రోజా వంటి గొప్ప నాయకురాలిని చూడలేదని, రోజా లేకపోతే నగరి నియోజకవర్గం ఏమైపోయాయి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోయినా, తాను ఇస్తానంటూ రోజా ముందుకు రావడం పైన ఆయన ప్రశంసించారు.రోజా ఇంటింటికి తిరిగి మాస్క్ లను పంపిణీ చేస్తున్నారని, మరే రాజకీయ నాయకులు ఇటు వైపు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలు రోజానే కావాలని చేయించినట్లు గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నగరి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి నారాయణ స్వామి పెత్తనం లేకుండా చేసేందుకు ఆమె ఈ విధంగా మాట్లాడినట్లుగా వైసీపీ కీలక నాయకులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం రోజా నగరి నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.పేదలకు కూరగాయలు పంపిణీ, ఇంటింటికీ మొక్కలు పంపిణీ, పేద ప్రజలకు భోజనాలు, పోలీసులకు స్వయంగా వంట చేసి ఇవ్వడం ఇలా నియోజకవర్గంలో రోజా దూసుకుపోతున్నారు.

ప్రభుత్వం చేయలేని పని రోజా చేస్తున్నారు అనే సంకేతాలు నియోజకవర్గంలో ఇచ్చేందుకు, తన రాజకీయ ప్రత్యర్ధులకు చెక్ పెట్టేందుకు ఇలా నగరి మున్సిపల్ అధికారులతో రోజా ఈ విధంగా మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది.తనకు మైలేజ్ వచ్చే విధంగా రోజా ప్లాన్ చేసుకోగా, ఇలా బెడిసికొట్టిందని వైసీపీ లో ఉన్న రోజా వ్యతిరేక వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.

ఈ విషయంలో వైసిపి అగ్రనాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube