బుల్లితెరపై అద్భుతమైన రేటింగ్స్ ను సొంతం చేసుకుని ప్రసారమవుతున్న కామెడీ షో లలో ఒకటైన జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ వేదిక ద్వారా ఎంతోమంది సినీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.
వందల మందికి ఈ కార్యక్రమం జీవితాన్ని ప్రసాదించింది.ఈ కార్యక్రమం మొదట్లో పలు వివాదాలకు కారణం అయినప్పటికీ ప్రస్తుతం ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా రోజా, సింగర్ మను వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.కంటెస్టెంట్ ల ఫర్ఫార్మెన్స్ కు జడ్జిమెంట్ ఇస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.ఇక షో విషయానికి వస్తే మొదట్లో కేవలం పురుషులు మాత్రమే ఈ షోలో పాటిస్పేట్ చేసేవారు.మగవారే ఆడవారి వేషధారణలో నటిస్తూ అందరినీ ఎంతగానో నవ్వించేవారు.
ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే కాకుండా లేడీ కమెడియన్స్ కూడా వస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు సీరియల్స్ లో సందడి చేసిన లేడీ కమెడియన్ రోహిణి జబర్దస్త్ వేదికపైకి ఎంటరయ్యారు.ఈ క్రమంలోనే ఏ కమెడియన్ స్కిట్ లో అవకాశం వస్తే అక్కడికి వెళ్లి తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.తాజాగా రోహిణి సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ఫోటోలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.జబర్దస్త్ జడ్జిగా, నగరి ఎమ్మెల్యేగా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా రోహిణి బుగ్గపై ముద్దు పెట్టింది.ఈ ఫోటోను రోహిణి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారింది.