యాంకర్ స్వాతి ఇటీవల అమెరికా నుండి మాట్లాడుతూ భారత దేశం గొప్పతనంను తెలియజేస్తూ అమెరికా పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేసింది.ఇండియాలో శవాల దిబ్బ చూస్తారంటూ వ్యాఖ్యలు చేసిన వారు ఇప్పుడు అమెరికా పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు అంటూ స్వాతి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
దాంతో ఆమెపై అమెరికాలోనే ఉండే ఒక తెలుగు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం అతడు మాత్రమే కాకుండా పలువురు తెలుగు వారు కూడా ఆమెపై విమర్శలు గుప్పించారు.
దాంతో స్వాతి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ సారీ చెప్పింది.
తాజాగా స్వాతి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించాడు.
అమెరికాలో లక్షల మందికి వైరస్ సోకుతుంటే కంట్రోల్ చేయలేక పోతున్నారు.ఇండియా జనాభా 130 కోట్లు ఉన్నా మన ప్రభుత్వం మాత్రం కంట్రోల్ చేయడంలో పూర్తి సక్సెస్ అయ్యిందని అన్నాడు.
ఈ విషయాన్ని ఆమె చెప్పింది.ఆమె చెప్పిన దాంట్లో తప్పేముందో నాకు అర్థం కాలేదు.
మోడీని పొగిడినందుకే ఆమెపై కొందరు కాంగ్రెస్ వాదులు అక్కడ కేసు పెట్టారని రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వాతి గారికి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
.