బుల్లెట్ ప్రూఫ్ కారుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.తనకు సెక్యూరిటీ నిమిత్తం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు పదే పదే మొరాయిస్తోందని తెలిపారు.
ఈ క్రమంలో ఆ కారు ఎక్కడ ఆగిపోతుందో తెలియదని చెప్పారు.ఎన్ని సార్లు సమస్య వచ్చినా రిపేర్ చేయించి మళ్లీ అదే బుల్లెట్ ప్రూఫ్ కారును పంపిస్తున్నారని వెల్లడించారు.
పాడైపోయిన వెహికిల్ ను ఎందుకు మళ్లీ పంపిస్తున్నారని అడిగితే కేసీఆర్ అదే పంపాలని చెప్పినట్టు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారని ఆరోపించారు.