ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్… చంద్రయ్య హత్యను టీడీపీ, చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించాలన్నదే టీడీపీ పన్నాగం.
బాబు హయాంలోనే మాచర్ల ప్రాంతంలో 15 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి.బ్రహ్మానందరెడ్డి మళ్ళీ మాచర్ల టీడీపీ ఇన్ చార్జి అయ్యాకే గొడవలు మొదలయ్యాయ్.
వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే పల్నాడులో చంద్రయ్య హత్య, రాజకీయాలకు సంబంధం లేదు.
చంద్రయ్య హత్యకు వైయ స్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, ఫ్యాక్షన్ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం.
ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా హంతుకులపై కఠిన చర్యల తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నాం.ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
మేం ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం కాబట్టే, మా కుటుంబాన్ని ప్రజలు 5 సార్లు గెలిపించారు.ఎవరు ఎలాంటి వ్యక్తులో, ఎవరి హయాంలో గొడవలు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలు ఆలోచన చేయాలి.