తెలంగాణ అభివృద్ధి కేవలం టీయార్ఎస్ తోనే సాధ్యం అంటూ గులాభినేతలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం తెలిసిందే.ఈ మాటలు ఇంకా 20 సంవత్సరాలైన పాతబడిపోవు అన్నది ప్రజల అభిప్రాయం.
ఇక నేతలు చెప్పినట్లుగానే తెలంగాణ అభివృద్ధి ధరల పెరుగుదలలో సృష్టంగా కనిపిస్తుందన్నదని ప్రజల్లో జరుగుతున్న చర్చ.పేదలు గుడ్దగోచికి కూడా నోచుకో లేకుండా మారడం అనేది మనం చూస్తున్న అభివృద్దని కొందరు విమర్శిస్తున్నారట కూడా.
ఇన్ని జరుగుతున్న టీయార్ఎస్ నేతల మాటల్లో పదును తగ్గడం లేదు.అందుకే ప్రజలతో రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామంటూ హామీలు ఇవ్వడం మానడం లేదు.ఇదిలా ఉండగా గోల్నాక డివిజన్లోని కృష్ణాననగర్లో రూ.7లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను సోమవారం గోల్నాక కార్పొటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీయార్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వచ్చే రెండేండ్లలో పరుగులు పెట్టిస్తానని అన్నారు.అదీగాక ఎప్పుడో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్లు ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా లేక పోవడంతో డ్రైనేజీ సమస్య తలెత్తుతోందని, అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.