కర్నూలు జిల్లా: బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ గా చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు.బనగానపల్లె నియోజకవర్గాన్ని జిల్లాల పునర్ విభజన లో భాగంగా డోన్ రెవెన్యూ డివిజన్ లో కలపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.
బనగానపల్లె ను డోన్ రెవెన్యూ డివిజన్ లో కలపడం వల్ల దూరం పెరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి తో కలిసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతాం.